Wednesday, 16 September 2026 04:45:50 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్.

Date : 14 September 2026 05:58 PM Views : 743

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం లోని 16వ డివిజన్ పరిధిలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన 40 మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ శిక్షణ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సోమవారం అంబేద్కర్ చమన్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పంపిణీలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గణేష్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగడం అనేది ఎదగాలని ఆలోచన రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇలాగే ప్రతి మహిళ కుటుంబంలో ఆర్థికంగా చేదోడువాదాడుగా ఉంటూ తన కాళ్లపై తన నిలబడి సమాజంలో ఒక గౌరవాన్ని పొందాలని సూచించారు. మన కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు సహకారంతో మహిళల స్వయం ఉపాధికి తమ వంతుగా అవకాశమున్న ప్రతి పనిని అందుబాటులోకి తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం పాటుపడుతున్న మదర్ తెరిసా ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సంధ్యా రెడ్డికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళలంతా క్రమశిక్షణతో శిక్షణ పొంది వృత్తిలో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షణ ఇచ్చిన టీచర్ కవిత, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, శిక్షణకు వసతి గృహాన్ని అందించిన దండే భాగ్యలక్ష్మి మరియు శిక్షణ పొందిన 40 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :