తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 11వ వార్డులోని లబ్ధిదారులందరూ రేషన్ షాప్ నెంబర్ 17 ,18, 26 సంబంధించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం మంజూరు పత్రాలను కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. ఆర్ పి జానకి, ఆర్పి కావేరిలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని వారి వద్ద నుండి ధ్రువపత్రాలు పొందాలని తెలుపుతున్నాను. గ్యాస్ సబ్సిడీ రానటువంటి వినియోగదారులు ఆ ధ్రువపత్రంలో ఉన్న గ్యాస్ సంబంధిత నెంబర్కు ఫోన్ చేసి దాని వివరాలు తెలుసుకొని 500 రూపాయలకె గ్యాస్ సబ్సిడీ పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్రా ఆర్పీలు జానకి, కావేరి, అంగన్వాడి టీచర్ శ్రీదేవి, వార్డు పెద్దలు చందర్, మూడు రమేష్, రాంప్రసాద్, తుత్తు, బాలు, శ్రీను మాస్, రాజేష్, సూర్య, భాస్కర్, రామకృష్ణ, వంశి, నిఖిల్, యుగేందర్, ఆయా మీనా, కొమరమ్మ, ఈశ్వరి మహిళలు వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ