తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలం, కాకర్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు భూక్య రమేష్ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ స్థాపన ప్రాముఖ్యతను వివరించారు. దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నదని, ప్రధాని Narendra Modi నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఉపాధ్యక్షుడు ధరవత్ బాలకిషన్, యువమోర్చా నాయకుడు గుగులోత్ రాంబాబు, కార్యదర్శి గుగులోత్ బాబులాల్, గిరిజనమోర్చా అధ్యక్షుడు భూక్య రవి, పూసులూరి మనోహర్, కర్నాటి వీరభద్ర రావు, కిష్టంశెట్టి గోపాల రావు, పాతర్లపాటి నవీన్, కళ్యాణపు వెంకటప్పయ్య, రొడ్డ సతీష్, బాణోత్ పృద్వి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ