Friday, 18 September 2026 03:08:19 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Date : 22 July 2026 05:47 PM Views : 134

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రాపర్టీ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించాలి రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉండాలి సీసీటీఎన్‌ఎస్‌ 2.0 కేసుల వివరాలు సకాలంలో నమోదు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య ఎస్పీ గారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, రికార్డులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు తదితర అంశాలను ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తుల పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ కేసుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించి, దొంగిలించబడిన ఆస్తులను త్వరితగతిన స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌లో నమోదయ్యే కేసులు, దర్యాప్తు పురోగతి, ఇతర వివరాలను సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, మట్కా, జూదం, కోడి పందాలు, పేకాట, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో బాధ్యతగా వ్యవహరించి త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య, ఎస్‌బీ-2 ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్‌ఐలు శ్యాంప్రసాద్, జగన్మోహన్ చారి,పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :