తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) గత 15 సంవత్సరాల నుండి సిపిఐ అభ్యర్థులను గెలిపిస్తూ ప్రజలు ఇస్తున్న ఆదరణ అలాగే మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాష సహకారం ఎన్నటికీ మరువలేనిదని పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పదో వార్డులోని నెహ్రూ బస్తి ,లక్ష్మీ టాకీస్ ఏరియా, క్యాంపు గుడి ఏరియా లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 12వ వార్డుగా ఉన్న సందర్భంలో ఇప్పటి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిర్ పాషాను ఆరోజు గెలిపించడం, ఆ తర్వాత నా భర్త మునిగడప వెంకటేశ్వర్లు ను ఆదరించడం ,మూడోసారి పదవ వార్డుగా జరిగిన ఎన్నికల్లో నన్ను ఆదరించడం మరువలేనిదని అన్నారు. మీ సమస్యల పట్ల మున్సిపాలిటీలో కొట్లాడేందుకు మీ ఓటు ద్వారా ఆదరించడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని ఆమె తన భావాలను ప్రజలతో పంచుకున్నారు.
ఐదు సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ,వార్డు అభివృద్ధి కోసం, శక్తివంచన మేరకు మేము కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని ఆమె అన్నారు. ఇప్పటికీ మీరు చూపిస్తున్న ఈ ఆదరణ మరువలేనిదని,ఈ ఆత్మీయ సమ్మేళనం లో శాలువాతో సత్కరించడం అనేది మా బాధ్యతను ఇంకా పెంచడమే అవుతుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మహిళలు ముద్దం మార్తమ్మ , మేడిపల్లి కవిత, బెల్లం బేబీ సుకన్య, కాటూరి ఏకాంత, రాం బాయ్, గాదం విజయ, పశుల ఈశ్వరి, లింగంపల్లి కౌసల్య, నాగుల విజయ, రావిశెట్టి పద్మ ,ఆసియా బేగం, రాధ, మేడిపల్లి వెంకటలక్ష్మి, మంగమ్మ, తహేర, జూపూడి సుశీల, హెలెన, జ్యోతి, కొండ రమాదేవి, శకుంతల, ఫాతిమా బేగం, కోటయ్య ,నరసయ్య,బయన ఈశ్వరయ్య, సోమయ్య, మేడిపల్లి సుధాకర్ ప్రవీణ్ కుమార్, దీవనమ్మ ,రాజేశ్వరి, సంసాని సత్యవతి, తిట్ల దివాకర్, ప్రసాద్, చిన్ని,నూరి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ