Wednesday, 16 September 2026 06:40:59 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రజాదరణ మరువలేనిది పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు

Date : 03 February 2025 06:52 PM Views : 606

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) గత 15 సంవత్సరాల నుండి సిపిఐ అభ్యర్థులను గెలిపిస్తూ ప్రజలు ఇస్తున్న ఆదరణ అలాగే మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాష సహకారం ఎన్నటికీ మరువలేనిదని పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పదో వార్డులోని నెహ్రూ బస్తి ,లక్ష్మీ టాకీస్ ఏరియా, క్యాంపు గుడి ఏరియా లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 12వ వార్డుగా ఉన్న సందర్భంలో ఇప్పటి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిర్ పాషాను ఆరోజు గెలిపించడం, ఆ తర్వాత నా భర్త మునిగడప వెంకటేశ్వర్లు ను ఆదరించడం ,మూడోసారి పదవ వార్డుగా జరిగిన ఎన్నికల్లో నన్ను ఆదరించడం మరువలేనిదని అన్నారు. మీ సమస్యల పట్ల మున్సిపాలిటీలో కొట్లాడేందుకు మీ ఓటు ద్వారా ఆదరించడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని ఆమె తన భావాలను ప్రజలతో పంచుకున్నారు.

ఐదు సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ,వార్డు అభివృద్ధి కోసం, శక్తివంచన మేరకు మేము కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని ఆమె అన్నారు. ఇప్పటికీ మీరు చూపిస్తున్న ఈ ఆదరణ మరువలేనిదని,ఈ ఆత్మీయ సమ్మేళనం లో శాలువాతో సత్కరించడం అనేది మా బాధ్యతను ఇంకా పెంచడమే అవుతుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మహిళలు ముద్దం మార్తమ్మ , మేడిపల్లి కవిత, బెల్లం బేబీ సుకన్య, కాటూరి ఏకాంత, రాం బాయ్, గాదం విజయ, పశుల ఈశ్వరి, లింగంపల్లి కౌసల్య, నాగుల విజయ, రావిశెట్టి పద్మ ,ఆసియా బేగం, రాధ, మేడిపల్లి వెంకటలక్ష్మి, మంగమ్మ, తహేర, జూపూడి సుశీల, హెలెన, జ్యోతి, కొండ రమాదేవి, శకుంతల, ఫాతిమా బేగం, కోటయ్య ,నరసయ్య,బయన ఈశ్వరయ్య, సోమయ్య, మేడిపల్లి సుధాకర్ ప్రవీణ్ కుమార్, దీవనమ్మ ,రాజేశ్వరి, సంసాని సత్యవతి, తిట్ల దివాకర్, ప్రసాద్, చిన్ని,నూరి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :