Thursday, 17 September 2026 07:35:21 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 27 April 2026 06:05 PM Views : 205

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం సంబంధిత శాఖల అధికారులు,రీజినల్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రిటైల్ స్థాయిలో అపోహల కారణంగా అనవసర గందరగోళం ఏర్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ముందస్తు కొనుగోళ్లు చేయకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వరి కోత యంత్రాలు, రవాణా లారీలు, వ్యవసాయ యంత్రాలకు ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పెట్రోల్ బంక్‌పై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలని, తాసిల్దారులు బంకుల రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇండెంట్ బుకింగ్ విధానాన్ని ముందుగానే సమర్థవంతంగా అమలు చేయాలని, అవసరమైన చోట ముందస్తు బుకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు జరిగే అవకాశం ఉన్నందున అటువంటి కార్యకలాపాలు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇటువంటి ప్రచారాల వల్ల ప్రజల్లో భయాందోళనలు ఏర్పడి అనవసరంగా ముందస్తు కొనుగోళ్లు జరుగుతున్నాయని, జిల్లాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. రిటైల్ అవుట్‌లెట్ల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, పౌరసరఫరాల శాఖతో పాటు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల పేరుతో అధిక మొత్తంలో డీజిల్ నిల్వచేసి బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల స్టాక్ వివరాలను వెంటనే సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా జరిగే పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు మరియు రవాణాను అరికట్టవచ్చని తెలిపారు. రిటైల్ అవుట్‌లెట్లపై పౌరసరఫరాల శాఖతో కలిసి నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు . బ్లాక్ మార్కెట్ లేదా అక్రమ రవాణాలో పాల్గొనేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :