Monday, 03 August 2026 10:17:45 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 04 November 2024 04:52 PM Views : 895

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు..... సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.. . కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఉంటున్న వికలాంగుడైన ఆగుళ్ళ మల్లేశం లోగడ వికలాంగుల కోటా కింద ప్రభుత్వం వారు టెలిఫోన్ బూత్ మంజూరు చేశారని, రాను రాను సెల్ ఫోన్ వాడకం పెరగడంతో టెలిఫోన్ బూత్ నడవక పూర్తిగా మూసివేయడం జరిగిందని, అదే ప్రదేశంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని, రైతు బజార్ నూతన నిర్మాణంలో భాగంగా నా యొక్క డబ్బాను పూర్తిగా తొలగించడం వల్ల రోడ్డును పడ్డానని, కావున దయ తలచి నూతనంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయంలో ఒక గదిని కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారు. . పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గట్టాయిగూడెం ఏడవ వార్డు లో నివాసం ఉంటున్న కాల్వ సూర్యకాంతమ్మ D/o పట్టాభిక్షం సర్వేనెంబర్ 712/అ /నాలో 12 ఎకరాల 26 కుంటల సొంత పొలం ఉన్నదని, ఆ పొలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు శాంక్షన్ అయినదని, సొంత స్థలంలో గవర్నమెంట్ రోడ్డు వేయడం పై తగు చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు. . ఇల్లందు నియోజకవర్గ కామేపల్లి మండలం ఊటుకూరు గ్రామం లో నివసిస్తున్న వడ్లకొండ బిక్షం s/o రామయ్య తనకు మూడు ఎకరాల పోడు భూమి ఉన్నదని దానిని గత 56 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తన పెద్ద కుమారుడు భార్య చనిపోవడం వల్ల గత ఎనిమిది నెలల నుండి సాగు చేయడం లేదని, దానిని అదునుగా చేసుకొని ఫారెస్ట్ అధికారులు తమ భూమినిస్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు. . బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీరాముల సక్కుబాయి w/o వీరస్వామి తను కూలీనాలీ చేసుకుని సారపాక సుందరయ్య నగర్ కాలనీలో 3.48 సెంట్లు ఇంటి స్థలం కొనుగోలు చేసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం కింద తమను చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఎండార్స్ చేశారు. . జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో వారు విధులకు హాజరు కాకపోవడం వలన గ్రామపంచాయతీలో పాఠశాలలు మరియు హాస్పిటల్స్ వద్ద దుర్వాసన రావడంతో విద్యార్థులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని భారతీయ గౌడ బంజారా పోరాట సమితి వారు చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి నివేదిక సమర్పించాలని జూలూరుపాడు ఎంపీడీవో నీ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :