తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం (తెలుగు వెలుగు) ఆగస్టు 1 జూలూరుపాడు : యూరియా ఆన్లైన్ బుకింగ్ల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సొసైటీ చైర్మన్ కొమ్మినేనిపాండురంగారావు సూచించారు. ప్రస్తుతం మనకు రావలసిన పరిమాణం కంటే తక్కువ మొత్తంలో యూరియా సరఫరా కావడంతో తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఏర్పడిందని ఆయన తెలిపారు.శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధిక మొత్తంలో యూరియా కేటాయించాలని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలోనే అదనపు యూరియా అందుబాటులోకి వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన విధంగా ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. రైతులు అధికారిక సమాచారాన్నే నమ్మాలని, వదంతులను విశ్వసించవద్దని కోరారు.సొసైటీ సీఈవో నరసింహారావు మాట్లాడుతూ, యూరియా నిల్వలు అందిన వెంటనే బుక్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేపడతామని తెలిపారు. రైతులు సహనంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ