Wednesday, 16 September 2026 05:46:30 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రెపరెపలాడిన సిపిఐ శతజయంతి ఉత్సవాల మొదటి జండా

Date : 26 December 2024 05:10 PM Views : 932

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదల కాలనీలో సిపిఐ శతజయంతి ఉత్సవాల మొదటి జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాపిర్ పాషా భద్రాద్రి కొత్తగూడెం (అర్బన్): పీడిత , బాధిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మికుడి, కర్షకుడి, పేద ప్రజల హక్కుల కోసం జన్మించి నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పదో వార్డులోని పేద ప్రజల ఇందిరమ్మ కాలనీ లో మొట్టమొదటి శతజయంతి ఉత్సవాల జెండాను సిపిఐ జిల్లా రథసారథి ,కార్యదర్శి ఎస్.కె షబీర్ పాష ఆవిష్కరించారు .గురువారం స్థానిక పదో వార్డులోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో షాబీర్ పాష మాట్లాడుతూ పీడిత, బాధిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మికుల, కార్మిక ,పేద ప్రజల హక్కుల సాధన కోసం ఏర్పడింది సిపిఐ నని, సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని ,ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ప్రజల కోసం పోరాడేది ఒక్క ఎర్ర జెండా మాత్రమే అన్నారు. అనేక పార్టీలు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని అది చరిత్ర చెబుతుందని అన్నారు . 1925లో కాన్పూర్లో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ నేటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందనన్నారు అందుకే ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సూర్య ,చంద్రాదులు ఉన్నంతవరకు ప్రజల కోసం జీవిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.జెండా ఆవిష్కరణలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జిల్లా, కౌన్సిల్ సభ్యులు కంచర్ల జములయ్య, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, బ్రాంచ్ కార్యదర్శి పియ్యాల రంగారావు, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఫై యుమ్ ,పదో వార్డు కౌన్సిలర్ పద్మ, నాయకులు ఉప్పతల శ్రీనివాస్, సబ్బని పాపారావు, గుంజ వెంకన్న ,శెట్టి రాజు, పల్లపు వెంకన్న ,మహిళలు మార్తమ్మ ,రాజేశ్వరి ,రమ్య తదితరులు పాల్గొన్నారు.

పదో వార్డులో వివిధ పార్టీల నుండి 40 కుటుంబాలు సిపిఐ లో చేరిక కొత్తగూడెం (అర్బన్) :వివిధ పార్టీల నుండి శెట్టి రాజు ,గుంజ వెంకన్న, ఉప్పుతల శ్రీను ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షబీర్ పాషా సమక్షంలో వారికి కండువాలు కప్పి సాదరంగా సిపిఐ లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సిపిఐ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ,వారి కష్టసుఖాల్లో పార్టీ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో శెట్టి రాజు, ఉప్పతల శ్రీను, గుంజ వెంకన్న, పల్లపు వెంకన్న, జట్పట్ రాజు ,శ్రీకాంత్, తిమోతి, ప్రసాద్ ,రాములు, సతీష్ ,వెంకటస్వామి, శివ, వంశి ,వెంకటేష్ ,సురేష్, నాగేశ్వరరావు, రాజశేఖర్, అజేందర్ ,అనిల్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిక్ సభ్యులు కంచర్ల జమలయ్య, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, రామవరం బ్రాంచ్ కార్యదర్శి పెయ్యాల రంగారావు ,పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు sk ఫైయుం, నాయకులు గుత్తి ల శ్రీనివాస్ సబ్బన్ పాపారావు, భానోత్ శ్రీను, మార్తమ్మ ,రాజేశ్వరి ,రమ్య, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :