తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఆహార భద్రత మరియు పరిశుభ్రత ప్రమాణాలపై వీధి ఆహార విక్రేతలు, రెస్టారెంట్ యజమానులు మరియు వంటకారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ హాజరై ఆహార భద్రత మరియు పరిశుభ్రత పాటించడం ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆహార పదార్థాలను శుభ్రంగా తయారు చేయడం, వంట ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, తాగునీటిని శుద్ధిగా వినియోగించడం, ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయడం, ఆహార తయారీలో పాల్గొనే వారి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ శరత్ మరియు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ & హైజీన్ ట్రైనర్ శ్రీమతి నందిని పాల్గొని ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత చర్యలు మరియు ఆహార కలుషితాన్ని నివారించే విధానాలపై వివరంగా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని రెస్టారెంట్ యజమానులు, వంటకారులు మరియు వీధి ఆహార విక్రేతలు పాల్గొని శిక్షణ పొందారు. ప్రజలకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ