Monday, 03 August 2026 07:59:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఆహార భద్రత మరియు పరిశుభ్రత ప్రమాణాలపై ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమం

Date : 17 March 2026 06:11 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఆహార భద్రత మరియు పరిశుభ్రత ప్రమాణాలపై వీధి ఆహార విక్రేతలు, రెస్టారెంట్ యజమానులు మరియు వంటకారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ హాజరై ఆహార భద్రత మరియు పరిశుభ్రత పాటించడం ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆహార పదార్థాలను శుభ్రంగా తయారు చేయడం, వంట ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, తాగునీటిని శుద్ధిగా వినియోగించడం, ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయడం, ఆహార తయారీలో పాల్గొనే వారి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ శరత్ మరియు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ & హైజీన్ ట్రైనర్ శ్రీమతి నందిని పాల్గొని ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత చర్యలు మరియు ఆహార కలుషితాన్ని నివారించే విధానాలపై వివరంగా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని రెస్టారెంట్ యజమానులు, వంటకారులు మరియు వీధి ఆహార విక్రేతలు పాల్గొని శిక్షణ పొందారు. ప్రజలకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :