Friday, 18 September 2026 07:23:14 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కాకర్ల గ్రామం నందు ప్లాస్టిక్ నివారణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ సభ నిర్వహణ

Date : 06 June 2026 05:40 PM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వ కార్యక్రమము అనుసరించి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలో గ్రామసభల నిర్వహణ – ప్రజలకు శాఖల ప్రగతి నివేదికల వివరణ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన జూలూరుపాడు మండలంలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు గ్రామసభలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామసభలకు జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు హాజరై ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామపంచాయతీ గ్రామ సభకు డిప్యూటీ కమిషనర్, పంచాయతీరాజ్ & రూరల్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ శ్రీమతి విద్యాలత , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నాగలక్ష్మి , ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా పరిషత్ శ్రీ అప్పారావు , డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ ప్రభాకర్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీ ఓ తులసీరామ్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామసభలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను చదివి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థుల బాధ్యతలు, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ అంశాలపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి నాగలక్ష్మి ప్రత్యేక వీడియో ప్రదర్శించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం గ్రామ ప్రజలందరితో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి విద్యాలత మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థలో వివిధ శాఖల సమన్వయం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయం అన్ని శాఖల కార్యక్రమాల సమన్వయ బాధ్యతను నిర్వహిస్తున్నందున, మండల స్థాయి అధికారులు పరస్పర సహకారంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని సూచించారు. గ్రామసభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :