తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హరిత విప్లవమే ధ్యేయంగా గత ఆరేళ్లుగా ప్రతి రోజు ఒక మొక్కను నాటుతు కొత్తగూడెం ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే కాక ఏకంగా ప్రధానమంత్రి మోడీ ద్వారా మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్న మొక్కల రాజశేఖర్ ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్యతో కలిసి తన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు మొక్కను రక్షించు – మాతృభాషను రక్షించు” అనే నినాదంతో సింగరేణి ఉద్యోగం చేస్తూనే తన తండ్రి పాండు ఇచ్చిన స్పూర్తితో రోజుకో మొక్కను నాటుతు మొక్కల రాజశేఖర్ గా పేరు తెచ్చుకున్న కొట్టూరు నుర్వి రాజశేఖర్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే ఎంతో మంది హరిత దీక్షలు తీసుకుని మొక్కలు నాటుతున్నారని ప్రశంసించారు. పెరుగుతున్న కాలుష్య రీత్యా మనకు మొక్కలు, చెట్ల విలువను చాటుతు రోజుకోక మొక్కను నాటుతు సమాజం కోసం రాజశేఖర్ చేస్తున్న విశేష కృషిని ఎంత పొగిడిన తక్కువే అన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా బ్లడ్ బ్యాంక్ బాలు, రామవరం పరిరక్షణ సమితి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ