తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ – మణుగూరు పోలీస్ స్టేషన్, ఏఆర్ డీఎస్పీ నివాస గృహం, పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గెస్ట్ హౌస్ ప్రారంభం. 06వ బెటాలియన్ సందర్శించిన డిజిపి.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ ఐపీఎస్ గారిని జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా పోలీసు అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర డీజీపీతో పాటు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ ఐపీఎస్ గారికి జిల్లా ఎస్పీ స్వాగతం పలికారు.అనంతరం మణుగూరులో నిర్మించిన పోలీస్ స్టేషన్ను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ ప్రారంభించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఆర్ డీఎస్పీ నివాస గృహాన్ని ప్రారంభించారు. అనంతరం 6వ బెటాలియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ పరికరాలను పరిశీలించి, విపత్తు నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్లో కల్పించిన వసతులను పరిశీలించి, పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.సమీక్ష సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రతి ఒక్కరూ వాటి నిర్మూలనకై కృషి చేయాలని, విద్యాసంస్థలు, యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సముదాయం, విద్యాసంస్థలు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పెంచాలని అధికారులను ఆదేశించారు.మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల సున్నితంగా స్పందిస్తూ, ప్రతి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అమలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్కు మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0 సమర్థవంతంగా వినియోగించుకొని సమాచారాన్ని పొందుపరచాలని సూచనలు చేశారు. ఇండస్ట్రియల్ దొంగతనాలు పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేరస్తులకు చట్టపరంగా శిక్షలు పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్,జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్,డీఎస్పీలు, సీఐలు, జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ