Sunday, 02 August 2026 03:54:14 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలి -*జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ....

Date : 28 August 2024 08:03 PM Views : 854

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు... బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీడీవోలు,తహసీల్దార్లతో శాఖల వారీగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను సకాలంలో సిద్ధం చేయాలని, ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో పని జరుగుతుందని అన్నారు.జాబితా తయారీలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. వారంలో రెండుసార్లు తప్పకుండా శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. డెంగ్యూ, చికెన్ గునియా,వైరల్ ఫీవర్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాలలో తక్కువ ఖర్చుతో ప్రత్యేక ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన మండలాలు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈనెల 31 వరకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి కోనోకార్పస్ మొక్కలను తొలగించి వాటి స్థానంలో పగోడా తదితర మొక్కలను నాటించాలని అధికారులకు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, వాటి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని చెప్పారు. జిల్లాలో మందుల కొరత ఉన్నదని తన దృష్టికి వచ్చిందని దీని విషయంలో అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ విద్యాచందన, డిపిఓ చంద్రమౌళి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు....

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :