Friday, 18 September 2026 06:13:45 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలి -*జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ....

Date : 28 August 2024 08:03 PM Views : 887

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు... బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీడీవోలు,తహసీల్దార్లతో శాఖల వారీగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను సకాలంలో సిద్ధం చేయాలని, ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో పని జరుగుతుందని అన్నారు.జాబితా తయారీలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. వారంలో రెండుసార్లు తప్పకుండా శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. డెంగ్యూ, చికెన్ గునియా,వైరల్ ఫీవర్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాలలో తక్కువ ఖర్చుతో ప్రత్యేక ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన మండలాలు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఈనెల 31 వరకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి కోనోకార్పస్ మొక్కలను తొలగించి వాటి స్థానంలో పగోడా తదితర మొక్కలను నాటించాలని అధికారులకు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, వాటి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని చెప్పారు. జిల్లాలో మందుల కొరత ఉన్నదని తన దృష్టికి వచ్చిందని దీని విషయంలో అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ విద్యాచందన, డిపిఓ చంద్రమౌళి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు....

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :