Thursday, 17 September 2026 05:22:51 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 17 September 2026 04:32 PM Views : 10

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈసిఐఎల్ సంస్థ సిఎస్ఆర్ ద్వారా రూ.67.41 లక్షల విలువైన వైద్య పరికరాల అందజేత ఐసీయూ, నేత్ర, ఆర్థోపెడిక్ విభాగాలతో పాటు ఆసుపత్రి పరిశుభ్రతకు ఆధునిక పరికరాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కొత్తగూడెంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , హైదరాబాద్ సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా రూ.67.41 లక్షల విలువైన ఆధునిక వైద్య, ఆసుపత్రి పరిశుభ్రత పరికరాలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందజేసింది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సమక్షంలో ఈసిఐఎల్ అధికారులు ఈ పరికరాలను ఆసుపత్రి అధికారులకు అందజేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా అందజేసిన పరికరాల్లో ఐసీయూ సేవల కోసం 3-ఫంక్షన్ రిమోట్ ఆపరేటెడ్ ఫౌలర్ కాట్స్, నేత్ర వైద్య సేవల కోసం ఆప్తాల్మిక్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్, ఫుట్ అడ్జస్ట్మెంట్ సదుపాయంతో కూడిన ఆప్తాల్మిక్ ఎలక్ట్రిక్ ఆపరేషన్ టేబుల్, ఆర్థోపెడిక్ డ్రిల్ యూనిట్ విత్ యాక్సెసరీస్, వాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ (VAC) మెషిన్ ఉన్నాయి. అదేవిధంగా ఆసుపత్రి పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు స్క్రబ్బింగ్ మెషిన్, కాంపాక్ట్ వాక్-బిహైండ్ స్వీపర్, హై-ప్రెజర్ వాషర్ వంటి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , సిఎస్ ఆర్ సంస్థల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులకు అందుతున్న వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలతో ఐసీయూ, నేత్ర, ఆర్థోపెడిక్ తదితర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రోగులకు సకాలంలో అవసరమైన వైద్యం అందేలా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆసుపత్రి క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యం కోసం వేచి ఉన్న ఓ రోగిని గమనించిన కలెక్టర్, ఎందుకు వేచి ఉన్నారు, సమస్య ఏమిటని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఓపీ సమయం ముగిసిన అనంతరం ఆసుపత్రికి వచ్చినందున వేచి ఉన్నట్లు రోగి తెలిపాడు. వెంటనే స్పందించిన కలెక్టర్, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్య సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సేవల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆసుపత్రి పరిశుభ్రతకు అందజేసిన పరికరాలను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, వైద్య విభాగాలు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోగులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఈసిఐల్ సంస్థ తరఫున డైరెక్టర్ (పర్సనల్) కన్నెన్ వి.ఏ.ఎస్., సీఎంఓ & ఇన్‌చార్జి (CSR) డా. పి. వేణుబాబు, డిప్యూటీ మేనేజర్ (HR), CSR సునీల్ కుమార్ జె., డిప్యూటీ మేనేజర్ (సివిల్) అనిల్ కుమార్ ఏ., ECOA అధ్యక్షులు పూర్ణచందర్ పి. ఫోటోగ్రఫీ అధికారి సాంబమూర్తి పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. రాధామోహన్, CPO శ సునీత, ఆసుపత్రి సీనియర్ అధికారులు, వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :