Monday, 15 June 2026 06:59:05 PM
# రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మహిళల భద్రత ప్రధాన లక్ష్యం. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గ్రామ సభలు. # బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్.

Date : 14 June 2026 06:14 PM Views : 229

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం.ప్రజా సేవలో అలసట లేకుండా పనిచేసిన వ్యక్తి శేషు.బాధిత కార్మిక కుటుంబానికి సిపిఐ, ఏఐటీయూసీ అండగా ఉంటుంది.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. పారిశుద్ధ్య కార్మికుడు గూడూరు శేషు అకాల మరణం అత్యంత బాధాకరమని, సమాజ ఆరోగ్య రక్షణ కోసం శ్రమించే కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మున్సిపల్ అధికారులపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్న 56వ డివిజన్ గాజులరాజం బస్తీకి చెందిన గూడూరు శేషు (46) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సాబీర్ పాషా, మూడ్ గణేష్ లు అక్కడికి చేరుకుని నాగయ్య భౌతికకాయాన్ని సందర్శించి, మృతదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాగయ్య మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంతో నిబద్ధతతో, అలసట లేకుండా ప్రజా సేవలో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. నాగయ్య మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగయ్య అకాల మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, తక్షణమే ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం స్పందించి బాధిత కార్మిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, పార్టీ పరంగా, మున్సిపాలిటీ పరంగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నివాళులర్పించినవారిలో సిపిఐ పట్టణ నాయకులు మొహమ్మద్ యూసుఫ్, గడ్డం సతీష్ కుమార్, ప్రభాకర్, కార్పొరేటర్ గడ్డం శాంతిప్రియ తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :