తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం.ప్రజా సేవలో అలసట లేకుండా పనిచేసిన వ్యక్తి శేషు.బాధిత కార్మిక కుటుంబానికి సిపిఐ, ఏఐటీయూసీ అండగా ఉంటుంది.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. పారిశుద్ధ్య కార్మికుడు గూడూరు శేషు అకాల మరణం అత్యంత బాధాకరమని, సమాజ ఆరోగ్య రక్షణ కోసం శ్రమించే కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, మున్సిపల్ అధికారులపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్న 56వ డివిజన్ గాజులరాజం బస్తీకి చెందిన గూడూరు శేషు (46) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సాబీర్ పాషా, మూడ్ గణేష్ లు అక్కడికి చేరుకుని నాగయ్య భౌతికకాయాన్ని సందర్శించి, మృతదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాగయ్య మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంతో నిబద్ధతతో, అలసట లేకుండా ప్రజా సేవలో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. నాగయ్య మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగయ్య అకాల మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, తక్షణమే ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం స్పందించి బాధిత కార్మిక కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి, అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, పార్టీ పరంగా, మున్సిపాలిటీ పరంగా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నివాళులర్పించినవారిలో సిపిఐ పట్టణ నాయకులు మొహమ్మద్ యూసుఫ్, గడ్డం సతీష్ కుమార్, ప్రభాకర్, కార్పొరేటర్ గడ్డం శాంతిప్రియ తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ