Thursday, 14 May 2026 02:24:37 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

70 లక్షల మొక్కలు నాటడమే వన మహోత్సవ లక్ష్యం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 May 2025 09:30 PM Views : 710

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2025-26 వన మహోత్సవంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో అన్ని శాఖల అధికారులతో వనమహోత్సవం పై ఐటీడీఏ పీవో రాహుల్ మరియు అటవీశాఖాధికారి కృష్ణ గౌడ్ తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందని, దీనిలో భాగంగా అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైతులకు, ఇంటి ఆవరణ, రహదారుల వెంట, కెనాల్ బండ్ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యధికంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 30 లక్షల మొక్కలు, టీ జి ఎఫ్ డి సి శాఖకు 12 లక్షల మొక్కలు, అటవీశాఖ 10 లక్షలు, సింగరేణి 10 లక్షలు, ఉద్యానవన శాఖ 5.7 లక్షలు, వ్యవసాయ శాఖ 5 లక్షలు, ఇరిగేషన్ 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించారు. వన మహోత్సవంలో భాగంగా నాటే మొక్కలు ఎక్సైజ్ శాఖ అధికారులు తాటి మరియు ఈత చెట్లను నాటాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మునగ మొక్కలు, అటవీశాఖ వెదురు మొక్కలు, విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో ఔషధ మొక్కలు అయినటువంటి తులసి, కరివేపాకు, ఉసిరి, మునగ మరియు వెలగ మొక్కలను నాటాలన్నారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న కెనాల్ బండ్ ప్లాంటేషన్ లో సుబాబులు మరియు వట్టివేర్లు మొక్కలు నాటాలన్నారు. ఆసక్తి గల రైతులకు అటవీ శాఖ నర్సరీలలో టేకు, ఎర్రచందనం మరియు వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయని అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించటానికి ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలని, వారికి కావలసిన మొక్కలను గ్రామీణ అభివృద్ధి సంస్థ నర్సరీ నుండి తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల త్రవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటడం తో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్, ఇరిగేషన్ ఈ ఈ అర్జునరావు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :