Sunday, 02 August 2026 09:07:57 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కార్పొరేషన్ ముసుగులో కాసుల వేటనా - మధ్యం పై మాట మార్చిన రేవంత్ రెడ్డి

Date : 01 December 2025 05:00 PM Views : 174

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ పుణ్యాన రోడ్డు ఎక్కిన వైన్స్ కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల అభివృద్ధి ఏమో కానీ మద్యం దుకాణాల షాపులు పెరిగాయని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయితీలను కార్పొరేషన్ పరిధిలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే,అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారేలా చేశారని గతంలో మండలం మొత్తం కలిపి రెండు వైన్ షాపులు ఉంటే కార్పొరేషన్ పుణ్యమంటూ ఇప్పుడు వైన్ షాపులు నాలుగుకు చేరుకున్నాయన్నారు ఒక దుకాణం మరీ దారుణంగా కాలేజీకీ కూతవేటున ఏర్పాటు చేశారని ఇది సరైంది కాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తామని,మద్యం అమ్మకాల పాలసీని మారుస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాను సైతం అదే పంథాలో నడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి సీఎం కెసిఆర్ హయాంలో 75 వేల మద్యం అమ్మకాలు మొదటి నాలుగు సంవత్సరాలలో జరిపితే మొదటి రెండు సంవత్సరాలలోనే 71 వేల కోట్ల మద్యం అమ్మకాలను జరిపి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి జరగకపోగా మద్యం అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని,ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,గజ్జెల శంకర్,చందు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :