తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ స్వేచ్చ,స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేసారు.మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని,పోలీసు అధికారులు సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు,ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,జిల్లా కార్యాలయ అధికారులు,సిబ్బంది,ఆర్ఐలు,సీఐలు,ఎస్సైలు,జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ