Friday, 18 September 2026 12:00:54 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

శేషగిరీనగర్ గ్రామ పంచాయతీ రోడ్డు పై గ్రామ ప్రజలతో బైఠాయించిన సర్పంచ్

Date : 10 January 2026 02:32 PM Views : 944

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ కాలనీ వాసులు సింగరేణి బొగ్గు లోడు టిప్పర్లని అడ్డుకొని ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రా పురం వెళ్లే మార్గంలో జిల్లా కోర్టు నుంచి మొదలు అనేక ప్రభుత్వ, సింగరేణి కార్యాలయాలతో పాటు చర్చీలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడి తీవ్రమైన కాలుష్యభరితంగా మారింది. సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గులోడు టిప్పర్లు నిత్యం ఈ మార్గంలో రవాణా జరుగుతుండడం వల్ల రోడ్లకు ఈ దుస్థితి ఏర్పడిందని, స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ఇటీవల శేషగిరి నగర్ కాలనీ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ గా ఎన్నికైన కృపా రేచల్ విమర్శించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ మార్గాన్ని ఫోర్ లైన్ రోడ్డుగా ఏర్పాటు చేస్తామని, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలంటూ సింగరేణి సంస్థ నుంచి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా 10 కోట్లు మంజూరు చేయాలని గతంలో ప్రతిపాదించి మాటలతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆమె ఆరోపించారు. నెలలు గడుస్తున్నా కూడా ఈ మార్గంలో గుంతలు మరింత ఎక్కువగా ఏర్పడి తీవ్రమైన దుమ్ము ధూళి కాలుష్యంతో శేషగిరి నగర్ కాలనీ వాసులు అనేక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని సర్పంచ్ కృపా రేచల్ ఆవేదన వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :