Thursday, 15 January 2026 05:42:42 AM
# సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు. # జర్నలిస్టుల అక్రమ అరెస్టులుహేయమైన చర్య జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరైంది కాదు. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ ఎన్నికలలొ జనసేన పోటీకి సిద్ధం. వేముల కార్తీక్. # హెచ్ పి సి కంపెనీ విజయవాడ రీజినల్ పరిధిలో గృహ అవసరాల గ్యాస్ అమ్మకం లో మొట్ట మొదటి స్థానం లో నిలిచిన సివిల్ సప్లయ్స్ పాల్వంచ ఎల్ పి జి సెంటర్. # భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 60 డివిజన్లో ముగ్గుల పోటీలు. # ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # జిల్లాలోని దుమ్ముగూడెం మరియు పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. డాక్టర్ తూకారామ్ రాథోడ్. # అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా అమలు చేస్తున్నాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి. # ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి. ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఖయ్యూం, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క # మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు . # దివ్యాంగ కుటుంబానికి నిత్యావసరాలు అందజేత # 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు, చివరి దశకు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన జట్లు. # మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు : కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్. # మెరుగైన నైపుణ్యాలతోనే యువతకు అవకాశాలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # పాల్వంచ పట్టణంలోని శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్, పద్మావతి స్కానింగ్ సెంటర్, శ్రీరక్ష హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ. # కెటిపిఎస్ 7 వ స్టేజ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కె. శ్రీనివాస్ బాబు ని ఘనంగా సన్మానించిన. ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు. # TG TET–2026 పరీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం : భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

శేషగిరీనగర్ గ్రామ పంచాయతీ రోడ్డు పై గ్రామ ప్రజలతో బైఠాయించిన సర్పంచ్

Date : 10 January 2026 02:32 PM Views : 520

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ కాలనీ వాసులు సింగరేణి బొగ్గు లోడు టిప్పర్లని అడ్డుకొని ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రా పురం వెళ్లే మార్గంలో జిల్లా కోర్టు నుంచి మొదలు అనేక ప్రభుత్వ, సింగరేణి కార్యాలయాలతో పాటు చర్చీలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడి తీవ్రమైన కాలుష్యభరితంగా మారింది. సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గులోడు టిప్పర్లు నిత్యం ఈ మార్గంలో రవాణా జరుగుతుండడం వల్ల రోడ్లకు ఈ దుస్థితి ఏర్పడిందని, స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ఇటీవల శేషగిరి నగర్ కాలనీ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ గా ఎన్నికైన కృపా రేచల్ విమర్శించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ మార్గాన్ని ఫోర్ లైన్ రోడ్డుగా ఏర్పాటు చేస్తామని, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలంటూ సింగరేణి సంస్థ నుంచి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా 10 కోట్లు మంజూరు చేయాలని గతంలో ప్రతిపాదించి మాటలతో కాలం వెళ్ళదీస్తున్నారని ఆమె ఆరోపించారు. నెలలు గడుస్తున్నా కూడా ఈ మార్గంలో గుంతలు మరింత ఎక్కువగా ఏర్పడి తీవ్రమైన దుమ్ము ధూళి కాలుష్యంతో శేషగిరి నగర్ కాలనీ వాసులు అనేక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని సర్పంచ్ కృపా రేచల్ ఆవేదన వ్యక్తం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :