Wednesday, 16 September 2026 05:08:30 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు.

Date : 14 July 2025 03:45 PM Views : 739

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు కొన్ని. సుజాతనగర్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి కి సంబంధించి 0.7 కుంటల భూమి కోల్పోయిన చెట్టుపల్లి ప్రభాకర్ రావు అనే రైతు తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదని, కావున త్వరితగతిన నష్టపరిహారం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవో కు ఎండార్స్ చేయడం జరిగింది. కొత్తగూడెం ఎన్కె నగర్ లో నివాసం ఉంటున్న సాకా ఠాగూర్ s/o పుష్పరాజు గత సంవత్సరం ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి కే ఎల్ ఆర్ కళాశాల నందు జాయిన్ అయ్యానని, కానీ అనారోగ్య కారణం చేత కళాశాలకు వెళ్లలేకపోయానని, తన ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం కళాశాలలను సంప్రదించగా మొత్తం ఫీజు చెల్లిస్తేనే తనకు సర్టిఫికెట్లు ఇస్తామని తెలియజేశారని, తన తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నామని కావున తనకు తన యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు.

పాల్వంచ మండలం యానం బైలు గ్రామంలో నివాసం ఉంటున్న ముగితే గురవయ్య s/o వెంకయ్య తనకు పూర్వీకుల నుండి వారసత్వంగా రాజాపురం గ్రామం శివారులో సర్వేనెంబర్ 107/72/1 లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, ఆ వ్యవసాయ భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూమికి నలువైపులా ఉన్న వ్యక్తులు తన వారసత్వ భూమిని ఆక్రమించుకున్నారని కావున తమ భూమిని సర్వే చేసి తన ఐదు ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించేటట్లు చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పాల్వంచ తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు.

ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కుంజా తిరుపతమ్మ w/o నరసింహారావు (లేటు) తాను ఒక నిరుపేద గిరిజన మహిళనని, పేదరికం వలన బ్రతుకు దుర్భరంగా మారినందున బ్రతుకుతెరువు కొరకు ఏదైనా పథకం క్రింద రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఐటిడిఏ పిఓ కు ఎండార్స్ చేశారు. అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొంతమంది ప్రజలు తమ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కొరకు ఎంపిక చేసిన జాబితా నుండి అనర్హులను తొలగించి, తమ గ్రామమునందు గల నిరుపేదలకు, వితంతువులు మరియు వికలాంగుల పేర్లు జాబితాలో చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ పిడి మరియు అశ్వరావుపేట ఎంపీడీవోకు ఎండార్స్ చేయడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :