Monday, 03 August 2026 04:59:34 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కుక్కల కోతుల నివారణకు చర్యలు తీసుకోవాలి : 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్

Date : 14 May 2026 06:20 PM Views : 195

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కలు ,కోతుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకొని వాటి నుండి ప్రజలను రక్షించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం డివిజన్ పరిధిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుక్కలు ,కోతులు పెద్దలపై ,చిన్న పిల్లలపై దాడులు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని ఆమె అన్నారు .మున్సిపల్ సిబ్బందిపైకూడా రెండు సందర్భాల్లో కోతులు, కుక్కలు దాడి చేసినా అధికారుల్లో చలనం లేకపోవడం శోచనీయమని అన్నారు. నిన్న పాల్వంచలో జరిగిన శిశువు తలను కుక్కలు తినడం దురదృష్టకరమైన ఈ సంఘటనను చుసిన తరువాత కూడా కార్పొరేషన్ అధికారులు మేలుకొని కుక్కలు ,కోతుల నివారణ పట్ల చర్యలు తీసుకోవాలని మరొక్కసారి అధికారులను డిమాండ్ చేశారు. కోతుల, కుక్కల నివారణ పట్ల అధికారులు చర్యలు తీసుకోనట్లయితే ప్రజలను సమీకరించి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు బెల్లం బేబీ, రావి శెట్టి పద్మ, రామ్ రాకేష్, వాసం బాబు, మార్తమ్మ, గుంజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :