Sunday, 02 August 2026 04:54:52 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఆరోగ్యకరమైన నారుమడి తయారీతో అధిక దిగుబడులు సాధించవచ్చు: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు.

Date : 05 July 2026 06:38 PM Views : 111

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఒక ప్రకటనలో సూచించారు. నాణ్యమైన నారు మంచి దిగుబడులకు, అధిక లాభాలకు పునాది అని తెలిపారు.ఒక ఎకరానికి నాట్లు వేయడానికి సుమారు 4 సెంట్ల భూమిని నారుమడిగా సిద్ధం చేయాలని చెప్పారు. భూమిని మెత్తగా దుక్కి చేసి సమతలంగా తయారు చేయాలని సూచించారు. దమ్ము నారుమడి పద్ధతిలో సాగు చేసే రైతులు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి పొలాన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు.విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి, అనంతరం 36 గంటలు మూట కట్టాలని, ఇలా చేయడం వల్ల విత్తనాలు త్వరగా, సమానంగా మొలకెత్తుతాయని పేర్కొన్నారు. మొలక వచ్చిన విత్తనాలను సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని సూచించారు.నారుమడిలో పలుచగా నీరు నిల్వ ఉండేలా నిర్వహిస్తే నారు ఆరోగ్యంగా పెరిగి, సరైన సమయంలో నాటేందుకు అనుకూలంగా తయారవుతుందని తెలిపారు. నారు దశలో సరైన సంరక్షణ చేపడితే పంట ప్రారంభం నుంచే మంచి ఎదుగుదల ఉండి, దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నారుమడిని సిద్ధం చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు కోరారు. అలాగే పంట ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సాంకేతిక సలహాలను వినియోగించుకోవాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :