Thursday, 17 September 2026 12:43:59 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వీరబాబు

Date : 17 July 2025 05:11 PM Views : 1130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పసుపులేటి వీరబాబు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యకలాపాల ఇన్చార్జిగా, కొత్తగూడెం ములుగు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బాధ్యునిగా, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడినిగా పేరున్న ఆయనను గ్రంథాలయ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలకడం తో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వీరబాబుకు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులను పరిచయం చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను త్వరలో పరిశీలిస్తానని, ఆయా గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలతో సమానమని, అలాంటి దేవాలయాలను సంపూర్ణంగా తీర్చిదిద్ది ఉద్యోగులు సిబ్బంది సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు. అంతా కలిసిమెలిసి పని చేద్దామని, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి పాఠకులకు అనుకూలమైన వాతావరణాన్ని గ్రంథాలయాల్లో మరింతగా ఏర్పాటు చేద్దామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకులు జి. మణి మృదుల, నాగన్న, మధుబాబు అశ్వరావుపేట నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులు పల్లె వరప్రసాద్, లక్ష్మీదేవి పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జల్లారపు ఈశ్వర్, భద్రాద్రి బీసీ సంఘం ఉపాధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్, లక్ష్మీదేవి పల్లి మండలం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లావుడియా నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :