Wednesday, 16 September 2026 06:52:46 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సర్కారు దవాఖానకు కార్పొరేట్ వైద్యం.ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి.

Date : 21 August 2026 06:27 PM Views : 208

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్కారు దవాఖానకు కార్పొరేట్ వైద్యం. ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి. కొత్తగూడెంలో త్వరలో క్యాథ్ ల్యాబ్. జీజీహెచ్‌కు రూ. 3 కోట్ల నిధుల మంజూరు. నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన విశేష కృషి ఎట్టకేలకు ఫలించింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ఆయన ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక సౌకర్యాలు సమకూరనున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే రోగుల ప్రాణాలను కాపాడేందుకు కీలకమైన అధునాతన క్యాథ్ ల్యాబ్ సేవలను ఇక్కడ త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పేదలు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా ఆస్పత్రిలోనే అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగుల కోసం అన్ని హంగులతో కూడిన 20 పడకల ఐసీయూ (ICU) విభాగాన్ని కూడా నిర్మిస్తున్నారు. గతంలో గుండెపోటు లేదా ఇతర తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మెరుగైన వైద్యం కోసం రోగులు సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, ఖమ్మం వంటి నగరాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యలోనే ఎందరో నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు జీజీహెచ్‌లోనే కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈ అన్ని రకాల అత్యున్నత వైద్య వసతులు సమకూరనుండటంతో స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటూ, సర్కారు దవాఖానను సూపర్ స్పెషాలిటీ స్థాయిలో తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కూనంనేని చొరవపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద రోగులకు ప్రాణవాయువులాంటి ఈ సౌకర్యాలను సాధించి చూపిన కూనంనేని సాంబశివరావు నాయకత్వంపై ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ ఆధునిక ఐసీయూ సేవల ద్వారా అత్యవసర విభాగంలో కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ పరిధిలోనే అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య వసతులు కల్పించే దిశగా ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :