తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగుడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అద్వర్యం కొత్తగూడెంలోని హోటల్ లేపాక్షి లో జరిగిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ను చిఎఫ్ ప్యాట్రన్ గా ఏకగ్రీవం గా ఎన్నుకోవటం జరిగింది.ఈ ప్రతిపాదన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అద్యక్షులు డాక్టర్ జీ .యుగంధర్ రెడ్డి ప్రతిపాదించగా అన్ని క్రీడాసంఘాలు ఏకగ్రీవం ఆమోదించటం జరిగింది .ఈ సందర్బముగా ఎస్.కె.సాబీర్ పాషా మాట్లడుతూ భద్రాద్రి కొత్తగుడెం జిల్లా లో మంచి ప్రతిభావంతులైన క్రిడాకారులు ఉన్నారని ,జిల్లా లో ఒక్క పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించుకోవాలని దానికి షుమారు 46 ఎకరాలు స్తలం అవసరము వుంటుందని తద్వరా అన్నిక్రిడలకు కోచ్ లు ,క్రీడాపరికరాలూ సాధనకు తనవంతు కృషి ఎప్పటికి ఉంటుందని తెలిపారు . ఈ సందర్బములో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అద్యక్షులు డాక్టర్ జీ .యుగంధరెడ్డి , చైర్మన్ కె.మహిధర్ ,వైస్ ప్రెసిడెంట్ వై . వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి పి. కాశి హుస్సన్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ జాయంట్ సెక్రటరి బరిగెల భూపేష్ కుమార్, మట్టపర్తి రమేశ్, జిల్లా రెజ్లింగ్ అద్యక్షులు నాగ సీతారాములు , జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జాయంట్ సెక్రటరి డి.మల్లికార్జున, సినియర్ అథ్లెట్ ఎండీ .బాబ్జి ,చిఎఫ్ కోచ్ పి .నగేందర్,జిల్లా టేక్ వన్దో కార్యదర్శి ఈ.మొగిలి ,జిల్లా కరాటే సెక్రటరి ఇంద్రాల శ్రీదర్ ,జిల్లా షూటింగ్ సెక్రటరి ఎండీ .అబ్దుల్ నబీ ,జిల్లా టి టి జాయంట్ సెక్రటరి రియాజ్ , జిల్లా జుడా సెక్రటరి ఇ .అదినారాయణ , ,జిల్లా వూషూ సెక్రటరి రఘు ,జాయంట్ సెక్రటరి రమేశ్ జిల్లా సాఫ్ట్బాల్ జాయంట్ సెక్రటరి ఎం.జస్వంత్ బాక్సింగ్ కోచ్ లు సత్తిబాబు ,ఈశ్వర్ , శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ