Monday, 03 August 2026 09:08:35 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్యారంగాన్ని విస్మరిస్తున్న రేవంత్ సర్కార్‌పై వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహం. భద్రాద్రి కొత్తగూడెంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.

Date : 10 July 2026 07:25 PM Views : 70

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యారంగాన్ని విస్మరిస్తున్న రేవంత్ సర్కార్‌పై వామపక్ష విద్యార్థి సంఘాల ఆగ్రహం.భద్రాద్రి కొత్తగూడెంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం.సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక.తెలంగాణలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. విద్యా సమస్యల పరిష్కారంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా విజయవంతమైంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించగా, ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బుర్రి వీరభద్రం, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం రోజురోజుకూ సంక్షోభంలోకి నెట్టబడుతోందని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను విరమించుకుని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు రూ.250 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, నూతన జాతీయ విద్యా విధానం–2020కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తీర్మానం చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాయి సంతోష్, గుగులోత్ వీరభద్రం, పీడీఎస్‌యూ నాయకులు విఘ్నేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :