తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూముల నిర్మాణం లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారిందని తక్షణమే డబల్ బెడ్ రూమ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ , మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వార్డులో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ల ఎంపిక కేవలం ఎన్నికల కోసం చేసినట్లుగానే ఉందని నిర్మాణాలు పూర్తిగా కాకుండానే డ్రా ఎలా తీసిచ్చారో అయోమయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసాక వారికి ఎలాంటి ధ్రువపత్రం ఇవ్వ కుండా కాగితాల మీద నెంబర్లు వేసి ఇవ్వటం లబ్ధిదారులను మోసం చేసినట్లు కాదా? అని వారు అధికారులను ప్రశ్నించారు. నిర్మాణాలు పూర్తి కాకుండా అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంద్రమ్మ ఇల్లులకు సర్వే నిర్వహిస్తున్నారని ఈ ఈ సర్వేలో ఇందిరమ్మ ఇల్లులకు అర్హత ఉంటుందో? లేదో? డబల్ బెడ్ రూమ్లు పూర్తయి చేసి చేతికి అందుతుందో? లేదో? అనే సందిగ్ధంలో లబ్ధిదారులు మదన పడుతున్నారని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ తప్పిదాన్ని సరిచేసి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగేలా డబల్ బెడ్ రూమ్ నిర్మానాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు ఫలానా టైం వరకు అందజేస్తామని లబ్ధిదారులకు జిల్లా అధికారులు భరోసా ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా డబుల్ బెడ్ రూమ్ ల సమస్యను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని లబ్ధిదారులకు తెలిపారు. ఈ సమావేశంలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డి హేమలత , డి నాగమణి, గడిదాస్ కుమార్ స్వామి, వేల్పుల స్వరూప, నాజియా, ఆసియా, నసిం, భరత్, ఎల్లమెల్లి సత్యనారాయణ, భవాని తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ