Monday, 03 August 2026 04:12:06 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ప్రజావాణిలో వచ్చిన ప్రతి వినతికి నిర్దేశిత గడువులో పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 06 July 2026 05:44 PM Views : 74

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతితో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రత, ఇతర శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ, నిర్దేశిత కాలవ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన వినతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే విశ్వసనీయ వేదిక అని అన్నారు . ప్రజల వినతులను కేవలం నమోదు చేయడం కాకుండా, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఏమాత్రం తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రజలు తమ వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని వినతులు సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామానికి చెందిన సంఘం నాగేశ్వరరావు, తన తండ్రి మరణించడంతో ఆయన పేరుపై ఉన్న పట్టా భూమిని వారసత్వ హక్కు ప్రకారం తన పేరుకు మార్చాలని చేసిన వినతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి, తదుపరి చర్యల కోసం సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం రాజు తండా గ్రామానికి చెందిన అజ్మీర రవి, కొత్తగూడెం–ఇల్లందు జాతీయ రహదారి విస్తరణలో తన ప్రహరీ గోడతో పాటు మూడు గదుల ఇల్లు కోల్పోతున్నందున తగిన నష్టపరిహారం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి, అవసరమైన చర్యల కోసం టేకులపల్లి తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం ఇందిరానగర్‌కు చెందిన పోతరాజు రమేష్, గత నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతూ, 50 శాతం వైకల్యం ఉన్నందున కుటుంబానికి ఆర్థిక ఆధారం లేక చికిత్స భారంగా మారిందని పేర్కొంటూ వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును జిల్లా కలెక్టర్ పరిశీలించి, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారికి ఎండార్స్ చేశారు. బూర్గంపహాడ్ మండలం ఎదుళ్ల చెరువు గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు, తాను 2000 సంవత్సరం నుంచి సాగు చేస్తున్న 1 ఎకరం 50 సెంట్ల పోడు భూమిలో సాటిలైట్ పాయింట్ మంజూరైందనే కారణంతో అధికారులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఆ భూమికి సంబంధించి సర్వే కూడా పూర్తయిందని పేర్కొంటూ వ్యవసాయం కొనసాగించేందుకు అనుమతి కల్పించాలని చేసిన వినతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి, తగు చర్యల కోసం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :