Wednesday, 16 September 2026 03:27:45 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

గుర్తింపు సంఘం ఎఐటియుసి తో యాజమాన్యం మధ్య జరిగిన స్ట్రక్చర్ కమిటీకమిటీ సమావేశం.

Date : 10 November 2025 06:46 PM Views : 571

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 150 మస్టర్ల ఆబ్సెటిజం సర్కులర్ పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా గత పాత విధానాన్నే కొనసాగించలి అని కోరిన గుర్తింపు సంఘం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని తెలిపిన యాజమాన్యం,అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలుపరచుటకు ఏర్పాటైన అధికారిక కమిటీలో యూనియన్ మెంబర్స్ ను కూడా తీసుకొని విధివిధానాలు నిర్ణయించి త్వరగా సమస్యను పరిష్కరించుటకు ఒప్పుకున్నారు, మరియుహైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున త్వరలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తారు. అలాగే గోదావరిఖనిలో క్యాతలాబ్(గుండె జబ్బుల) హాస్పిటల్ కూడా వచ్చేనెలలోపు ప్రారంభిస్తామని తెలియజేశారు,మరియుబదిలీ వర్కర్లుగా అపాయింట్మెంట్ అవుతున్న ఉద్యోగులందరూ ఇకనుంచి జనరల్ అసిస్టెంట్ ట్రేనిగా నియమించబడతారు,అదేవిధంగా పెరిక్స్ (అలవెన్స్) లపై పడే ఇన్కమ్ టాక్స్ ను యాజమాన్యమే భరించాలనే విషయాన్ని ప్రభుత్వ అనుమతి తీసుకుని పరిష్కరించుటకు ఒప్పుకున్నారు,మరియ మెడికల్ బోర్డును యధాతధంగా కొనసాగించుటకు నిర్ణయం తీసుకున్నారు,మరియుజే ఎం ఓ 62, ఫోర్ మెన్ (మెకానికల్) 12, ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) 41, సూపర్వైజర్ (సివిల్) 1, ఆఫీస్ సూపరిండెంట్ 4, స్టాఫ్ నర్స్ 86, జూనియర్ అకౌంటెంట్ 1 లకు A1 గ్రేడ్ వారికే కాకుండా ఏ గ్రేడ్ లో ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగిన పై వారందరికీ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు ఒప్పుకున్నారు,మరియు డెసిగ్నేషన్స్ మార్పు విషయమై మార్చ్ లోపల కోల్ ఇండియా కమిటీ రిపోర్ట్ ప్రకారము మార్చుటకు నిర్ణయం జరిగింది,అదేవిధంగామారుపేర్ల విషయమై ఒక్కొక్క కేసును విడివిడిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు,మరియుపర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు 9 మందికి రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు అంగీకరించారు,మరియుఅన్ని గనులలో కార్మికులకు కప్బోర్డ్ లు మరియు లాకర్స్ ఏర్పాటు చేయుటకు సర్కులర్ జారీ చేస్తారు,అదేవిధంగా1000 లోపు పెన్షన్ పొందుతున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ అయిన 2016 రూపాయలను ఇప్పించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, ఇతర డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమల్ రావు సంబంధిత జనరల్ మేనేజర్లు, గుర్తింపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు కే సారయ్య , కే వీరభద్రయ్య, వై వి రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శులు అక్బర్ అలీ వంగ వెంకట్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :