తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి.ఆగస్టు 27 (తెలుగు వెలుగు ) లక్ష్మీదేవిపల్లి మండలం లోని లోతు వాగువద్ద గంజాయి రవాణా చేస్తోన్న మారుతి ఎర్టిగా కారును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ (ఖమ్మం)బృందం మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. కొత్తగూడెంలో రూట్వాచ్ నిర్వహిస్తుండగా అక్రమంగా కారులో గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. సీలేరు నుంచి హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్నారు. 45 కిలోల ఎండు గంజాయి, కారు (మారుతి ఎర్టిగా), ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రవాణా చేస్తోన్న సంగారెడ్డి కి చెందిన రాథోడ్ సంతోష్,భువనగిరి జిల్లా ముల్కలపల్లి కి చెందిన బానోత్ వీరు ను అరెస్ట్ చేశారు. నిందితులను గంజాయి వాహనాన్ని తదుపరి విచారణ కోసం కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు. కాగా ఇదే బృందం భద్రాచలం లో ద్విచక్ర వాహనం పై రవాణా చేస్తోన్న 4.11కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.భద్రాచలంరవాణా కార్యాలయం వద్ద మంగళవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా గుంటూరు కు చెందిన ఎస్కె.యూసుఫ్ పల్లెబోయిన శ్రీహరి ,విజయవాడ కు చెందిన సదా వెంకట దుర్గారావు సీలేరు నుంచి విజయవాడకు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు .ఈ దాడుల్లో కరీం, బాలు, సుధీర్, వెంకట్, హరీష్, హనుమంతరావు, విజయ్, ఉపేందర్ పాల్గొన్నారు.ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ( ఖమ్మం) జి గణేష్ గౌడ్, డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ