Monday, 03 August 2026 12:06:56 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తెలంగాణ ఉద్యమకారులు మోసపోవద్దు : తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పోనుగోటి సంపత్

Date : 26 March 2026 12:48 PM Views : 407

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి చిరకాల స్వప్నమైనటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పూటకొకటి ఉద్యమకారుల జేఏసీ పేరుతో పుట్టకొస్తున్న బూటకపు సంఘాల మోసపూరిత వాగ్దానాలతో మోసపోవద్దని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు ఉద్యమిస్తామని అనేక బూటకపు సంఘాలు తెరపైకి వస్తున్నాయని ఆ సంఘాలు నడిపేటటువంటి నాయకులు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారో, ఏ పార్టీలో ఉన్నారో నిక్కర్సైన ఉద్యమకారులు గుర్తించాలని, ఉద్యమ సమయంలో కేసులకు భయపడి ఇంటి నుండి కాలు బయటకు పెట్టని వారు నేడు ఉద్యమకారుల జేఏసీ పేర్లతో బూటకపు సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 250 గజాల ఇంటి స్థలం, మరియు ఇల్లు నిర్మాణం, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా, అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, పెన్షన్ మరియు స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలుగా ఉద్యమకారులను ఆదుకుంటాం అనే అంశాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడమే కాక వారి ఆర్థిక స్వలాభాల కోసం సభ్యత్వాల పేరుతో, వారి సంఘాల గుర్తింపు కార్డుల పేరుతో, ఇంటి స్థలాలు ఇప్పిస్తామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కనీసం రిజిస్ట్రేషన్ లేని సంఘాలు అమాయకపు ఉద్యమకారులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆధారంగా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటూ ఉండగా, ఈ బూటకపు సంఘాలు ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొలుపుతూ ప్రభుత్వానికి నిజమైన ఉద్యమకారులకు దూరం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారని దానికి తగిన మూల్యం త్వరలో చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కోదండరాం గారి నేతృత్వంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని, దానికి అనుగుణంగా నిజమైన, నిక్కార్స్ అయినా ఉద్యమకారులను గుర్తించే పనిలో రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సిఐడి, తదితర నిఘ వర్గాల ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాల నుండి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారి వివరాలు సేకరించడం జరిగిందని, నిజమైన ఉద్యమకారులు అనగా ముందస్తు అరెస్టులు, బైండ్ఓవర్ కేసులు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు, జైల్ రికార్డులు ఎవరైనా కోల్పోయినట్లయితే సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చని, కేసులు ఉంటేనే ఉద్యమకారులు లేదంటే ఉద్యమకారులు కాదని ఈ బూటకపు సంఘాల ప్రచారం చేస్తున్నాయని చాలామంది తెలంగాణ జేఏసీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించినప్పటికీ కేసులు కాలేదని అంతమాత్రాన వారి ఉద్యమకారులు కాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులని వివిధ విభాగాలుగా గుర్తిస్తుందని తెలిపారు. కనీసం ఉద్యమ సమయంలో రోడ్డెక్కని నాయకులు స్వతాగా సంఘాలు ఏర్పాటు చేసుకొని వారి ఆర్థిక ప్రయోజనాల కోసం వారి మనుగడ కాపాడుకోవడం అమాయకపు తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వానికి దూరం చేయొద్దని కోరారు. ముందుగా ఉద్యమకారుల జేఏసీల పేరుతో వస్తున్న వారు ఆ నాయకుల ఉద్యమ నేపథ్యం జైలు జీవితాలు, పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, రౌడీ షీట్లు, పీడి యాక్ట్ ,వారు చేసిన ఉద్యమ నేపథ్యం ఉద్యమకారులకు తెలిపిన తర్వాతనే సమావేశాలు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో నిజమైన ఉద్యమకారుల సమన్వయంతో చట్టపరమైన చర్యలకు సిద్ధపడుతామని హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :