Sunday, 02 August 2026 06:38:48 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా అమలు చేస్తున్నాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Date : 13 January 2026 06:18 PM Views : 266

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మేడారంలో మరో 200 సంవత్సరాలు నిలిచేలా రాతి నిర్మాణాలతో అభివృద్ధి పనులు.అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్లలా భావిస్తూ ప్రజా ప్రభుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌లతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ మార్కెట్ భవనం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.7 కోట్ల వ్యయంతో మంజూరైన అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు.సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది ఆదివాసీల అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి తరలివచ్చే మహోత్సవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని తలపించేలా రాతి నిర్మాణ పద్ధతిలో మరో 200 సంవత్సరాలు నిలిచే విధంగా మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానున్నారని, 19న మేడారం పునరుద్ధరణ, అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత రెండు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని మంత్రి తెలిపారు. దాని ఫలితంగానే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 శాతం స్థానాల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఇదే విశ్వాసంతో రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు ప్రజా ప్రభుత్వానికే మద్దతు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :