తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్): 134వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పదో వార్డు లోని అంబేద్కర్ చమన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం అంబేద్కర్ చమన్ లో 10వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, సిపిఐ సీనియర్ నాయకులు సావటి స్వామి లు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనంలో అనుభవించిన అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ఆయన పడ్డ కష్టమే భారత రాజ్యాంగం అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా కుల ,మత ,వర్గ, వైశాల్యాలు లేని సమాజం కోసం మానవులందరికీ సమాన హక్కులు కల్పించి, అందరికీ విద్యను అందించడం ద్వారానే అంటరానితనం నిర్మూలన జరుగు తున్నదని భావించిన గొప్ప దార్శనికుడని వారు కొనియాడారు .ఆయన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక సౌకర్యాలను కులం, మతం ,వర్గ బేధం లేకుండా అందరూ సమానంగా హక్కులను అనుభవిస్తున్నారు. అందుకే అంబేద్కర్ ఏ ఒక్క కులానికో ,ఏ ఒక్క మతానికో చెందిన వాడు కాదని ,అంబేద్కర్ అందరివాడు అని వారు పేర్కొన్నారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం యొక్క ఔనత్యాన్ని కాపాడుతామని ,భారత రాజ్యాంగ మూలాలను దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఐక్యమత్యంతో అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈ రోజు నుండి కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ పూనారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు గంటాడి కోటేశ్వరరావు, బయన ఈశ్వరయ్య ,శాఖ కార్యదర్శులు సూరి మేని జనార్ధన్ ,రావుల దాసు, ఎస్కే జలీల్, సత్యనారాయణ (కొండ) ఆర్ఎంపీ డాక్టర్ సబ్బాని సతీష్, మహిళలు మార్తమ్మ టీచర్ ఎన్ సరోజ, నాయకులు అజరయ్య ,కాంపల్లి దుర్గయ్య ,బానోత్ చందర్, సూరిమేని రామారావు ,తోగరు నరేందర్ ,సబ్బని పాపారావు ,బానోత్ శ్రీను, ఉప్పతల శ్రీను, గుంజ వెంకన్న ,గోపి, సలీం, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ