Thursday, 17 September 2026 07:42:47 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మానవతా విలువలను పెంపొందించాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

Date : 26 August 2026 04:42 PM Views : 132

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజ హితానికి దిక్సూచి సేవా గుణమే సమాజానికి శ్రేయస్కరం మత సామరస్యాన్ని కాపాడుకుందాం ఐక్యతతోనే శాంతి, సౌభ్రాతృత్వం పేదలకు అండగా నిలవడమే నిజమైన సేవ మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, కరుణ, సేవా మార్గాలు యావత్ మానవాళికి ఆచరణీయమని, ఆయన బోధనలు సమాజ హితానికి దిక్సూచిగా నిలుస్తాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుక 'మిలాద్ ఉన్ నభి' సందర్భంగా అంజుమన్ కమిటీ అధ్యక్షులు అమీర్ ఖాద్రి ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం రోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి, ఆధ్యాత్మికత దాగి ఉన్నాయన్నారు. సమాజంలో మత సామరస్యాన్ని, ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. పేదరికం, ఆకలి లేని సమసమాజ నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అంజుమన్ కమిటీ రోగుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా మోహన్, మైనార్టీ సంఘాల పెద్దలు, నాయకులు ఖాజా బాబా, ఎండి యూసుఫ్, గౌస్ మొయినుద్దీన్, షమ్మీద్దీన్, కార్పొరేటర్ దావూద్, విజయ్, చారి, గడ్డం సతీష్, ఇమ్రాన్, అజీజ్, ఎండి.జహీర్ అలీ, టీచర్ దస్తగిరి, జహీర్, షాహూద్ రజా, మెహబూబ్ ఖాద్రి, హాజీ రంజాన్ ఖాన్, జమాల్ జుబేద్ ఆలం, ఇర్ఫాన్ యాకూబ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :