Saturday, 01 August 2026 11:51:12 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం : జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లేనినా

Date : 01 August 2026 03:11 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, ఆ తర్వాత మరో సంవత్సరం పాటు తల్లిపాలు ఇవ్వడం తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకు రక్షణ కవచం లాంటిదని జిల్లా సంక్షేమ అధికారిని జే స్వర్ణలత లేనినా పేర్కొన్నారు. స్థానిక భద్రాద్రి కొత్తగూడెం బస్టాండ్ లోని తల్లి పాలిచ్చే గదిని లాంఛనంగా ప్రారంభించి బాలింతలకు తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని మాట్లాడుతూ ప్రసవించిన మొదటి గంటలోపే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రారంభించేలా తల్లులకు సహకారం అందించాలని, తల్లిపాలే నవజాత శిశువును అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయని, బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించడం, ఈ ఆరు నెలల్లో బిడ్డ ఎదుగుదల మరి అభివృద్ధికి అవసరమైన పోషకాలన్ని తల్లిపాలలోని లభిస్తాయని, ఇలాంటి ఇతర పదార్థాలు తినిపించకుండా, త్రాగించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే తల్లి బిడ్డల ఆరోగ్య భద్రత ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానుగుణంగా బిడ్డ పుట్టిన వెంటనే తేనే, పంచదార లాంటి మూఢనమ్మకాలు నమ్మకుండా ముర్రుపాలె ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అర్బన్ సిడిపిఓ, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, మహిళా సాధికారిత జిల్లా బృందం, ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :