Monday, 03 August 2026 02:57:05 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 21 July 2026 12:33 PM Views : 118

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.బిఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యం. ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి, అర్హులందరికీ ఓటు హక్కు అందేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మండల పరిధిలోని లోతువాగు గ్రామంలో మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే శక్తి ఓటుకే ఉందన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత స్థానిక శ్రేణులపై ఉందన్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున నియమితులైన బిఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) ఎప్పటికప్పుడు ఓటర్ జాబితాలను పరిశీలించి లోపాలను సవరించేలా చూడాలన్నారు. జాబితాలో తప్పుల సరిదిద్దడం, కొత్త ఓటర్ల చేర్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాల్లో బిఎల్ఏలు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు, ఎన్నికల అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఓటర్ల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా జాబితా తయారీకి సహకరించాలని ఆయన కోరారు. ఎస్ కె యాకూబ్ పాషా, ఈసం రాములు, పట్నం కుటుంబరావు, రజని, రాజు, మహేష్, బోయిన స్వరూప, నబీ, దాసు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :