Thursday, 17 September 2026 08:44:42 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మొదటి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 09 December 2025 08:21 PM Views : 420

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అందజేసి తగు సూచనలు చేయాలన్నారు. ఈనెల 11న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతం నివేదికను టీ పోల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు ప్రీసైడింగ్ అధికారులకు రిటర్నింగ్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ లు, ఇతర సిబ్బంది సహకరించాలన్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఓటర్లకు సకాలంలో పోలింగ్ స్లిప్స్ అందజేయాలన్నారు. మరో రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కొన్ని గ్రీన్ పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్, భద్రాచలం, పినపాక, చర్ల, కరకుగూడం మండలాల పరిధిలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295 మంది సిబ్బంది నియమించారని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఐడిఓసి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి, అవసరమైన అన్ని సామాగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియలపై స్పష్టమైన సూచనలు అందించినట్లు తెలిపారు. భద్రాచలం–సారపాక వంటి ప్రధాన పంచాయతీల్లో బ్యాలెట్ బాక్సుల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ నెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపును ప్రారంభించి సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, డిపిఓ సుధీర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :