తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం.మహానేతకు ఘన నివాళులు - టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు.కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ వేపలగడ్డలో మరియు కొత్తగూడెంలో దివంగత మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని వేపలగడ్డ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్. సంక్షేమ పాలన ఎప్పటికీ ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జిల్లా, మండల, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ