తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సేవా స్ఫూర్తికి ప్రతీకగా కోదండరాం జన్మదిన వేడుకలు.రక్తదానం.. భారీ అన్నదానం.. అనాథ పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పోనుగొటి సంపత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను కేవలం కేక్ కటింగ్, శుభాకాంక్షలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలకు నాంది పలకాలని కోరారు. చేయడం రక్తదాన కార్యక్రమం, కేక్ కటింగ్, భారీ అన్నదానం, అనాథ పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలను ఒకే వేదికగా నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను సంపత్ చాటిచెప్పారు.సాధారణంగా జన్మదిన వేడుకలను వ్యక్తిగత సంబరాలుగా నిర్వహించడం పరిపాటిగా మారిందని అలాంటి వ్యవస్థకు స్వస్తి చెప్పి, రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పించాలన్నారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించడమే కోదండరాం లక్ష్యమని దానికనుగుణంగానే మనమందరం పనిచేయాలని పొనుగోటి సంపత్ తెలిపారు. అదేవిధంగా కోదండరాం జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ యార్డ్ లోని హమాలీలకు, రోడ్లపై ఉన్న అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదనే భావనతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పట్టణంలోని సత్యసాయి అనాధ శరణాలయం, వనవాసి శరణాలయంలో అనాథ పిల్లలకు నోట్ పుస్తకాలు మరియు చదువుకునే సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది.విద్య అనేది ప్రతి చిన్నారి హక్కు అనే భావనతో, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన పిల్లలకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారికి అండగా నిలిచామన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం గారి జన్మదిన పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు మరియు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోదండరా ఆయురారోగ్యాలతో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కోదండరాం గారు పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలు, హక్కులు, ఆత్మగౌరవం చుట్టూ సాగిందని, అదే స్ఫూర్తితో సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం అవసరమని పేర్కొన్నారు. ఈ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గొర్ల సురేష్, ఉద్యమ నాయకులు మధు, ఇజాజ్,రమేష్, వివిధ కళాశాలల విద్యార్థులు, మలిదశ తొలిదశ ఉద్యమకారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ