Wednesday, 16 September 2026 04:09:10 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

రేగళ్ల తండా ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ

Date : 16 September 2026 03:02 PM Views : 41

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై అసంతృప్తి మెనూ అమలులో నిర్లక్ష్యంపై వార్డెన్‌కు షోకాజ్ నోటీసు వసతి గృహంలో సౌకర్యాలు, ఆహార పదార్థాల నాణ్యతపై పరిశీలన పనిచేయని ఆర్వో ప్లాంట్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలి లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, అక్కడ అపరిశుభ్రతతో పాటు చెత్త ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని ఎన్‌సీసీ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎన్‌సీసీలో ఉన్న విద్యార్థుల సంఖ్య, గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం తదితర వివరాలను ఉపాధ్యాయులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తదుపరి బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, భోజనం తదితర సౌకర్యాలను పరిశీలించారు. కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేసి నిల్వ ఉంచిన సరుకులు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కిచెన్‌లోని ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడాన్ని గమనించిన కలెక్టర్, అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టి ఆర్వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, తాగునీరు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం మెనూలో చికెన్ అందించాల్సి ఉన్నప్పటికీ విద్యార్థులకు వడ్డించిన భోజనంలో చికెన్ లేకపోవడాన్ని కలెక్టర్ గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించడంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేస్తూ, సంబంధిత వార్డెన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం విషయంలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు . ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో సుచిత్ర, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :