తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విశేష కృషి చేస్తోంది మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చండ్రుగొండ మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని తెలిపారు అనాలోచిత నిర్ణయాల వలన సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు అందుకే డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు ముఖ్యంగా యువత ఈ అవగాహన కార్యక్రమాలను ఉపయోగించుకొని డ్రగ్స్కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ