తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జమ్ము కాశ్మీర్లోని పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ కొత్తగూడెం పట్టణంలోని 10వ వార్డు మాజీ కౌన్సిలర్లు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, సీనియర్ న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమాయకులైన పర్యటకులపై ఉగ్రవాదుల దాడి సహించరానిదని, దీనికి ఖచ్చితమైన సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇక కొవ్వొత్తుల ర్యాలీలో స్థానిక ప్రజలు పెద్ద అజరయ్య ,మార్తమ్మ, హేమలత ,రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, పాముల కోటేశ్వరి ,సుధాకర్, జావిద్ ,కిరణ్, రాజేశ్వరరావు, మహబూబ్ ,యాకూబ్ అలీ ,తదితరులు ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ