Thursday, 17 September 2026 07:33:10 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

అంతర్జాతీయ కార్మిక దినోత్సం సందర్భంగా రామవరం టి బి జి కె ఏస్ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Date : 01 May 2026 05:57 PM Views : 224

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ కార్మిక దినోత్సం సందర్భంగా రామవరం టి బి జి కె ఏస్ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య ప్రదాన కార్యదర్శి కాపు కృష్ణ హాజరైనారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు...ఉత్పత్తి రంగంలో దేశ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల కష్టం మరువలేదని ఆయన తెలియచేశారు.. మే డే స్ఫూర్తితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మిక హక్కుల పరిరక్షణ, సంస్థ ప్రగతి నే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన తెలియచేశారు.. కేసీఆర్ పాలనలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘం గా కొనసాగిన సమయంలో సింగరేణి కార్మిక సంక్షేమానికి అందించిన పథకాలను, సాధించిన హక్కులను ఆయన గుర్తు చేశారు.. కార్మిక హక్కుల పరిరక్షణ, కొత్త హక్కుల సాధన కోసం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ దిశ నిర్దేశం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి నాయకత్వంలో టి బి జి కె యస్ చేస్తున్న కార్యాచరణ, ప్రణాళికలు ఆయన వివరించారు.1886 సంవత్సరంలో చికాగో నగరంలో 3 లక్షల మంది కి పైగా కార్మికులు 08 గంటల పని దినాల కోసం రోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా శాతియుతంగా నిరసన చేస్తుంటే విచక్షణ రహితంగా పోలీస్ లు జరిపిన కాల్పుల్లో 06 గురు కార్మికులు మరణించినారని కొంత మంది నాయకులను ఉరి తీశారని, మరి కొంత మంది అశువులు బాశారని వారందరి ప్రాణ త్యాగాలకు గుర్తుగా మే డే ను జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు...భారత దేశంలో 1923 లో చెన్నయ్ లో మే డే ఉద్యమం ప్రారంభమైనప్పటికీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ లో కార్మిక సభ్యుడిగా ఉన్న అంబేద్కర్ కార్మిక చట్టాలు రూపకల్పన చేశారని 08 గంటల పని దినాల నినాదాలను చట్టం రూపంలోకి మార్చిన గొప్ప మహనీయుడు అంబేడ్కర్ అని ఆయన కార్మిక వర్గానికి అందించిన చట్టాలే నేడు ప్రతి కార్మికుడికి శ్రీరామ రక్ష లాగా నిలుస్తున్నాయని ఆయన తెలియచేశారు... నేడు కార్మిక వర్గం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని అంబేద్కర్ రూపొందించిన చట్టాలకు తూట్లు పొడిచే పెత్తందారులు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని కార్మిక వర్గం ఐక్యత గా ఉంటేనే అంబేద్కర్ సాధించిన హక్కులను కాపాడుకోగలుగుతామని ఈ సందర్భంగా ఆయన పిలుపు,నిచ్చారు.. ఈ కార్యక్రమంలో నాయకులు వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాగిత విజయకుమార్,బోరింగ్ శంకర్,మహేందర్, వెంకటేశ్వర్లు, తిరుపతి,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :