తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాపు కృష్ణ, గూడెల్లి యాకయ్య, పూల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిట్ నోటీసుల పేరుతో కెసిఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలను ప్రజలందరూ గమనిస్తున్నారనేది మరిచిపోవద్దు. మొన్న హరీష్ రావు గారికి, ఆ తరువాత కేటీఆర్ గారికి, ఈరోజు తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తూ ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు.. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉన్నది.. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని తెలియజేస్తూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ లో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ఇవ్వాలని అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కృష్ణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ, రుద్రంపూర్ మండలాల అధ్యక్షులు యాకయ్య , గడప రాజయ్య వైస్ ప్రెసిడెంట్ టీబీజీకేఎస్, మాజీ సర్పంచులు, గుమ్మడి సాగర్, పూల రవీందర్, ఆంజనేయులు, యూసుఫ్,ఉమర్, రవి తదితర ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ