తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జీ.ఓ.నెం 76 అన్ లైన్ ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జీ.ఓ.76 ప్రవేశ పెట్టగా సుమారు 2 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని దరఖాస్తుతో పాటు డబ్బులు కూడా కట్టారని ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే పట్టాల పంపిణీ ప్రక్రియను నిలిపివేశారని ఎన్నికలు జరిగి 10 నెలలు దాటినా నేటికీ పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభికపోవడంతో ఇల్లులు కొనుగోలు,అమ్మకాలు జరగక ప్రజలు ఆర్దికంగా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,హరికృష్ణ,మురళి,తనుష్,సాయి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ