తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వైరా మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఎఐజి హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.మదన్ లాల్ మరణ వార్త వినగానే అభిమానులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు.వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్. ఈయన 1963 మే 03న రఘునాథపాలెం మం. ఈర్లపూడి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో బి ఎ పూర్తి చేశారు. వైరా నుంచి 2009లో అసెంబ్లీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చంద్రావతి చేతిలో ఓడిపోయారు. 2012లో వై ఎస్ ఆర్ సి పి లో చేరి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాజకీయ పరిణామాల దృష్ట్యా అప్పటి టి ఆర్ ఎస్,( బి ఆర్ ఎస్) లో చేరారు, 2018, 2023లో వరుసగా ఓటమి చెందారు.
Admin
తెలుగు వెలుగు టీవీ