Friday, 19 June 2026 02:26:13 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేస్తా : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 18 June 2026 05:05 PM Views : 158

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండ్ల స్థలాలపై పలుమార్లు సీఎంకు విన్నవించా పండుగ వాతావరణంలో కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే విషయమై ఇప్పటికే పలుమార్లు సీఎంతోనూ మాట్లాడనని అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కొత్తగూడెం ప్రెస్ క్లబ్ను కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్తో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జర్నలిస్టుల కోసం కొత్తగూడెంలో పది ఎకరాల స్థలాన్ని ఇతరత్రా వాటికి కేటాయించకుండా కాపాడుతున్నానన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. నగరంలో సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా హామీలతోనే కాలం వెళ్లబుచ్చిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇండ్ల స్థలాల విషయంలో జాప్యం చేస్తుండడం బాధాకారమన్నారు. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో వెలుగు స్టాఫ్ రిపోర్టర్ కీలక భూమిక పోషించడం అభినందనీయమన్నారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్ రిపోర్టర్లు పోతు రాజేందర్, లోగాని శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, యెర్రా ఈశ్వర్, జునుమాల రమేష్, కల్లోజి శ్రీనివాస్, మోటమర్రి రామకృష్ణ, శంకర్, లక్ష్మణ్, అఫ్జల్, కృష్ణ గోవింద్, కాగితపు వెంకటేశ్వర్లు, నర్సింహ్మ, పండుగ రేశ్వంత్, రవి, రాజేశ్, కుమార్, నాగాచారి, భాస్కర్, సురేష్, పూర్ణ, పాపారావు, రాజేష్, కృష్ణారావు, సుధాకర్, శ్రీనివాస్, షఫి, ఉమాకాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :