Thursday, 02 July 2026 05:25:36 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

సీతారామ ప్రాజెక్టు నీళ్ళు జూలూరుపాడు కు ఇవ్వాలి : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 28 August 2024 07:03 PM Views : 531

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : సీతారామ నీళ్ళు జూలూరుపాడు మండలానికి ఇవ్వాలని,సీతారామ ప్రాజెక్టు నీళ్ళ విషయంలో జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను విరమించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలసి వినోబా నగర్ లింకు కాలువను పరిశీలించి మాట్లాడుతూ పాత డిజైన్ ను మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని,పాత డిజైన్ ను అమలు చేసి 20 మండలాలకు సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు అనుసంధానం చేసి నీరు అందించాలన్నారు.2005 సంవత్సరంలో దుమ్ముగూడెం ప్రాజెక్టుతో మొదలై మధ్యలో సీతారామ ప్రాజెక్టుగా అవతరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో తవ్వినటువంటి కాలవను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూట్ మ్యాప్ తీసుకువచ్చి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో వినోబా నగర్ వద్ద నుండి ఖమ్మంకు కాలువ తవ్వుతున్నారని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు,అదేవిధంగా జూలూరుపాడు మండలంలోని పంట కాలువల ద్వారా ప్రతి చెరువును నింపిన తర్వాతనే వేరే జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీరు మొత్తం,వేరే జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్ళడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?? ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు 40% పూర్తయింది ఇంకా 60 శాతం పనిచేయాల్సి ఉంది అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీతారాం ప్రాజెక్టు కాలవను ఎలా ఓపెన్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.జిల్లావ్యాప్తంగా చెరువులను కుంటలను నింపేందుకు కాలవలు తవ్వకుండా ఖమ్మం జిల్లాకి వెళ్ళేటటువంటి కాలువ పనులు చక చక చేయించటం ఎందుకని,జిల్లా ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నా ప్రజల ఓట్లతో గెలిచిన ఎంఎల్ఏలు ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నించారు.ఏదిఏమైనాప్పటికీ జిల్లాకు నీటిని అందించకుండా,జూలూరుపాడు మండలానికి నీరునందించకుండా వేరే జిల్లాకి తరలిస్తే ప్రజాఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీఎస్పీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు,శివ,బన్నీ,నరేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :