తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతన ఏర్పాటుచేసిన రక్త నిల్వ కేంద్రం సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, రిబ్బన్ కటింగ్ చేసి, బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాట్లను పరిశీలించారు . రక్త నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..“రక్తదానం అంటే ప్రాణదానం, మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఇతరరికి జీవం పోసే వరంగా మారుతుంది. గర్భిణీలు, తలసీమియా, సికిల్ సెల్, అనీమియా వంటి వ్యాధులతో బాధపడేవారు, ప్రమాదాల వల్ల గాయపడిన వారు రక్తానికి ముఖ్యంగా ఆధారపడుతారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలిఅని పిలుపునిచ్చారు.రక్తదానం చేయడం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణీలు, తల సేమియా, సికిల్ సెల్, అనీమియా, వంటి రోగులకు మరియు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం ప్రాణ రక్షణగా మారుతుంది అన్నారు. మణుగూరులో ఈ రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు కావడం ద్వారా, అత్యవసర పరిస్థితులలో పేషెంట్లకు రక్తాన్ని సమీపంలోనే అందుబాటులోకి తేవచ్చు. ఇప్పటి వరకు రక్త అవసరాల కోసం ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై అది అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సునీల్ మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సందర్భంగా 20 మంది రక్తదానం చేశారు. నూతనంగా ప్రారంభించిన రక్తనిల్వ కేంద్రానికి సరిపడా రక్త నిల్వల కోసం ఈ రక్తాన్ని ఉపయోగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మరియు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ