Thursday, 17 September 2026 04:40:12 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మణుగూరులో నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం , రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్.

Date : 04 August 2025 06:14 PM Views : 821

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతన ఏర్పాటుచేసిన రక్త నిల్వ కేంద్రం సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, రిబ్బన్ కటింగ్ చేసి, బ్లడ్ బ్యాంక్ లో ఏర్పాట్లను పరిశీలించారు . రక్త నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..“రక్తదానం అంటే ప్రాణదానం, మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఇతరరికి జీవం పోసే వరంగా మారుతుంది. గర్భిణీలు, తలసీమియా, సికిల్ సెల్, అనీమియా వంటి వ్యాధులతో బాధపడేవారు, ప్రమాదాల వల్ల గాయపడిన వారు రక్తానికి ముఖ్యంగా ఆధారపడుతారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలిఅని పిలుపునిచ్చారు.రక్తదానం చేయడం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణీలు, తల సేమియా, సికిల్ సెల్, అనీమియా, వంటి రోగులకు మరియు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం ప్రాణ రక్షణగా మారుతుంది అన్నారు. మణుగూరులో ఈ రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు కావడం ద్వారా, అత్యవసర పరిస్థితులలో పేషెంట్లకు రక్తాన్ని సమీపంలోనే అందుబాటులోకి తేవచ్చు. ఇప్పటి వరకు రక్త అవసరాల కోసం ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై అది అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సునీల్ మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సందర్భంగా 20 మంది రక్తదానం చేశారు. నూతనంగా ప్రారంభించిన రక్తనిల్వ కేంద్రానికి సరిపడా రక్త నిల్వల కోసం ఈ రక్తాన్ని ఉపయోగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మరియు శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :